Breaking News

అమరావతిలో ‘స్ట్యాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ వద్ద పొట్టి శ్రీరాములకు నివాళులు

అమరావతి, మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రజారాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ‘Statue of Sacrifice’ పేరుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుతో కలిసి పలువురు నాయకులు పాల్గొన్నారు. ‘అమరజీవి త్యాగశిల్పం’గా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించారు.ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నాయకులు పేర్కొన్నారు.

జంతు హింసపై యాంకర్ రష్మి ఆగ్రహం.. వైసీపీ నిరసనపై విమర్శలు

ప్రైవేట్ బస్సులపై కట్టుదిట్టం.. 80 కి.మీ వేగానికి మించి నో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *