యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు రాజపేట భారతీయ జనతా పార్టి మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏదైతే అడ్డదారులు తొక్కి 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి… వాటిని అధికారం రాగానే తుంగలో తొక్కినందుకు మరియు 22A జివో రద్దు చేయాలని పేదవారు పొట్టకట్టుకుని తిని తినక రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కూల్చవద్దు అని మంగళ వారం రోజు స్థానిక తహసిల్దార్ ఆఫీస్ యందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ కోయ మధు మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పకీరు రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
