Breaking News

“మా హామీలు క్యాలెండర్ ప్రకారం అమలు చేశాం” – జగన్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనను సమర్థించుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.తన పాలనలో ఇచ్చిన హామీలను ఎప్పుడూ విస్మరించలేదని, ముందుగానే క్యాలెండర్ ప్రకటించి వాటిని అమలు చేశామని తెలిపారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన పేర్కొన్నారు.అలాగే, తమ పాలన ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కొనసాగిందని, అయినప్పటికీ ప్రజల కోసం కట్టుబడి పనిచేశామని చెప్పారు. మరోవైపు ప్రస్తుత సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, అవినీతి కోసం మాత్రమే వారు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.వ్యవస్థలను దెబ్బతీసి ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే మిగిల్చారని కూడా విమర్శించారు. తమ పాలనతో పోలిస్తే ప్రస్తుత పాలనలో స్పష్టమైన తేడా ఉందని ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.

కార్మికుల కోసం ‘లేబర్ అడ్డా’లు ఏర్పాటు: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కార్మిక ఐక్య పోరాటంతోనే హక్కుల సాధన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *