Breaking News

నాపై ఫాల్స్ కేసులు.. హైకోర్టులో పోరాటం: అంబటి రాంబాబు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తనపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మూడు వేర్వేరు కేసుల్లో అన్యాయంగా తనను రిమాండ్‌కు పంపారని తెలిపారు.ఇంకా తన ఇల్లు, కారును ధ్వంసం చేసి తనపై ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, అరెస్టులు కూడా జరగలేదని విమర్శించారు.ఈ విషయంపై న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోరాటం చేస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *