మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తనపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మూడు వేర్వేరు కేసుల్లో అన్యాయంగా తనను రిమాండ్కు పంపారని తెలిపారు.ఇంకా తన ఇల్లు, కారును ధ్వంసం చేసి తనపై ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, అరెస్టులు కూడా జరగలేదని విమర్శించారు.ఈ విషయంపై న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోరాటం చేస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
