Breaking News

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న హెడ్ కానిస్టేబుల్….!

విజయవాడ. మార్చి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పోలీసు శాఖ నందు అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకి తభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విశిష్టమైన సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డ్ ఉత్కృష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఇందులో ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే G.రమేష్ కు అవార్డ్ వరించింది. 2003 లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరిన రమేష్ నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకున్నాడు. అవార్డ్ కు తన పేరు ప్రతి పాదించిన అధికారులకు, పోలీస్ కమిషనర్ రాజశే ఖర్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అమెరికాలో తెలుగు విద్యార్థినికి విశిష్ట గౌరవం

రాష్ట్రానికి మరో 7 విమానాశ్రయాలు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *