విజయవాడ. మార్చి 18 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాకాల సూర్యనారాయణ భవన్లో నూతన మాకాల గోపాలం సేవా సమితి’ ప్రారంభం జరుగుతుందని సంస్థ కన్వీనర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా విజయవాడ లో ఆయన కార్యాలయంలో ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య అవగాహన సదస్సు చికిత్స శిబిరము జరుగుతుందని, ఇందులో పలువురు ఆరోగ్య నిపుణులు పాల్గొంటారని, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, మెడ నొప్పులు మొదలగు నొప్పులతో బాధపడుతున్న వారు పాల్గొని చికిత్స, అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డాక్టర్ మాకాల సత్యనారాయణ కోరుతు న్నారు. ఉగాది సందర్భంగా పలువురికి పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. చికిత్స శిబిరంలో పాల్గొనువారు సెల్ 9000347369 కు పేర్లు నమోదు ఉదయం 9 గంటల కల్ల నమోదు చేసుకోవలసిందిగ కోరటమైనది. అని సంస్థ (మాకాల గోపాలం సేవ సమితి) అర్తమూరు కన్వీనర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.
