Breaking News

ఐడీఎఫ్ దాడి.. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఖతీబ్ హతం? ఇజ్రాయెల్ ప్రకటన

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. రాత్రిపూట జరిగిన దాడిలో ఖతీబ్ మరణించారని తెలిపారు.అయితే ఈ ఘటనపై ఇరాన్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.

టెన్షన్ పెంచుతున్న పరిణామాలు

  • ఇరాన్‌కు చెందిన కీలక భద్రతాధికారి అలి లారిజానీ మరణించినట్లు ఇప్పటికే సమాచారం
  • టెహ్రాన్‌లోని సైనిక కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడులు
  • పలువురు మృతి, మరికొందరు గాయాలు

అమెరికా బహుమతి ప్రకటన

ఖతీబ్ ఆచూకీ తెలిపిన వారికి అమెరికా 10 మిలియన్ డాలర్ల వరకు బహుమతి ప్రకటించినట్లు సమాచారం.

పార్లమెంట్‌లో ప్రత్యేక ఫోటో సెషన్.. వీడ్కోలు క్షణాల్లో నేతల సమాగమం

మరింత దాడులకు గ్రీన్ సిగ్నల్?

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అనుమతితో, అవసరమైతే మరిన్ని ఇరాన్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకునే అధికారాన్ని సైన్యానికి ఇచ్చినట్లు రక్షణ మంత్రి వెల్లడించారు.మొత్తం మీద మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మోదీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. భవ్య పథకం, ప్రత్తికి MSP, FCRA బిల్లుకు గ్రీన్ సిగ్నల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *