Breaking News

పార్లమెంట్‌లో ప్రత్యేక ఫోటో సెషన్.. వీడ్కోలు క్షణాల్లో నేతల సమాగమం

న్యూఢిల్లీ, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): పార్లమెంట్ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫోటో సెషన్ ఆకర్షణగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్తో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ నేపథ్యంలో ఈ ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య 59 మంది సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వారికి స్మరణీయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు.

తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి కూడా ఈ ఫోటోలో పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

👉 రాజ్యసభ సభ్యుల రాజకీయ ప్రస్థానంలో ఒక గుర్తుండిపోయే క్షణంగా ఈ ఫోటో సెషన్ నిలిచింది.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *