మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఉగాది పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తెలుగులో సందేశం పంపిస్తూ పండుగ ప్రాముఖ్యతను వివరించారు.“ఉగాది అనేది కొత్త ఆరంభాలకు, ఆశలకు ప్రతీక. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, విజయాలు, ఆరోగ్యం నింపాలని కోరుకుంటున్నాను. ప్రజలు తమ లక్ష్యాలను సాధిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.ఇదే సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని నేతలు ప్రజలకు సందేశం ఇచ్చారు.
