మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఉగాది పర్వదినం సందర్భంగా వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ప్రత్యేక సందేశం ఇచ్చారు.శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శ్రేయస్సు నింపాలని ఆయన కోరుకున్నారు.
