Breaking News

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5 లక్షల జీవిత బీమా

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం 2026–27 వార్షిక బడ్జెట్ సందర్భంగా ప్రజలకు మరో కీలక శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం “ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా” అనే కొత్త పథకాన్ని ప్రకటించింది.ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత జీవిత బీమా అందించనున్నారు. కుటుంబానికి ప్రధాన ఆదారమైన వ్యక్తి అనుకోకుండా మరణించిన సందర్భంలో, ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలుకాకుండా రక్షణ కల్పించడమే ఈ పథక ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వెల్లడించింది.బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే “ఇందిరమ్మ ఇళ్లు” పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు జీవిత భీమా ద్వారా మరింత భరోసా కల్పిస్తోంది.ఈ పథకం 2026 జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి లేకపోయినా వారి భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ఈ పథకం కీలక పాత్ర పోషించనుంది. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారిస్తూ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా మరో ముందడుగు వేసింది.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *