Breaking News

తాండూర్ పీ.హెచ్ .సీ లో ప్రత్యేక వైద్య శిబిరం

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి రోగులకు వైద్య సేవలు అందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఝాన్సీ రాణి కోరారు. ఈ వైద్య శిబిరంలో తాండూర్ సర్పంచ్ ముడిమడుగుల సురేష్, తాండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ఈసా, ఉప సర్పంచ్ సత్యం, బుగ్గ దేవాలయ డైరెక్టర్ కోరాల శంకర్, న్యాయవాది ఎండి జుబేర్, యూత్ జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ పెట్టిన విష్ణు కళ్యాణ్ తో పాటు నాయకులు పురంశెట్టి అరుణ్, జీతుల వేణు, కంపెల శ్రీను, నియాజ్ అలీ, మగ్దూం బాబా, సనా జాఫర్ తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *