Breaking News

డీజిల్ ధరలపై భారీ షాక్.. లీటరుకు రూ.22 పెంపు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటడంతో, భారతదేశంలో పెట్రోలియం కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు రూ.22 మేర పెంచగా, ఇది రూ.87.57 నుంచి రూ.109.59కి చేరింది. అలాగే ప్రీమియం పెట్రోల్ ధరను కూడా లీటరుకు సుమారు రూ.2 పెంచారు. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు చేయలేదు.ఈ పెరిగిన ధరలు మార్చి 20 రాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవుట్‌లెట్లలో ఎక్స్‌పి95 పెట్రోల్ ధర రూ.101.80 వరకు చేరగా, కొన్ని నగరాల్లో రూ.113 దాటింది.

ఎల్‌పీజీ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

పారిశ్రామిక డీజిల్ సాధారణంగా పెట్రోల్ బంకుల్లో అమ్మరు. ఇది ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లు, మైనింగ్ కంపెనీలు, భారీ నిర్మాణ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తారు. ఈ ధరల పెరుగుదలతో పరిశ్రమలపై భారం పెరగడం ఖాయం.మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా Iran పరిస్థితులు ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయంగా కూడా ధరలు పెరిగాయి.అదేవిధంగా భారత రూపాయి విలువ కూడా పడిపోతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 93 కంటే దిగువకు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది.మొత్తంగా, ఇంధన ధరల పెరుగుదల ప్రభావం పరిశ్రమల నుంచి సామాన్య ప్రజల వరకు అన్ని వర్గాలపై పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

LPG కంటే PNG మంచిదే – కేంద్రం కీలక సూచనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *