Breaking News

CM Revant Reddy Focus on Public Guru Schools

ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై సీఎం ఫోకస్

ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

హైదరాబాద్, డిసెంబర్ 14:
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రులతో కలిసి, జిల్లాలవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల పాఠశాలలలో నేరుగా తనిఖీలు నిర్వహించేందుకు రంగంలోకి దిగనున్నారు.

అమరావతికి మద్దతు, కానీ విభజన హామీలు నెరవేరాలి: రేణుకా చౌదరి

రేపు (డిసెంబర్ 15) సీఎం రేవంత్ రెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని సంక్షేమ హాస్టల్స్‌ను ఆకస్మికంగా సందర్శించనున్నారు. ఈ సందర్శనలో ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారి కోసం వండిన భోజనాన్ని కూడా రుచి చూసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ తనిఖీలు, ముఖ్యంగా ఆహార నాణ్యతతో పాటు, హాస్టల్ వాతావరణం, విద్యార్థుల సౌకర్యాలు మరియు ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని జరిగేలా ఉంటాయి.

కరీంనగర్‌ లయన్స్ క్లబ్ చారిటబుల్ కంటి ఆసుపత్రికి కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం

తనిఖీల సందర్భంగా, ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా వివిధ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *