Breaking News

panchayat elections are ready

పల్లెపోరుకు కసరత్తు

పల్లెపోరుకు కసరత్తు

డిసెంబర్ 14, 2024:
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓటరు జాబితాలను కొలిక్కి తెచ్చి, బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

ఎన్నికల సిబ్బందికి ప్రవర్తనా నియమావళి పుస్తకాలు, విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణ పుస్తకాలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాయి.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం
ఈసారి జిల్లా పంచాయతీ ఎన్నికలు విడతల వారీగా జరగనున్నాయి. ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండగా, ఈ ఎన్నికల్లో 200 ఓటర్లకు మాత్రమే ఒక కేంద్రం ఉండనుంది.

జిల్లాలో 2,544 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో:

200 ఓటర్లలోపు కేంద్రాలు: 1,888
201 నుంచి 400 ఓటర్ల వరకు: 585
401 నుంచి 600 ఓటర్ల వరకు: 71 కేంద్రాలు ఈ ప్రాంతాలలో పోలింగ్‌ కేంద్రాలను పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు వచ్చినా వాటిని పరిశీలించి, పోలింగ్‌ కేంద్రాలను ఈ నెల 17న ఫైనల్‌ చేయనున్నారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

తుది ఓటరు జాబితా సిద్ధం
పోలింగ్‌ కేంద్రాల పరిశీలనలో అధికారులు ఇప్పటివరకు మరెన్నో నిర్ణయాలు తీసుకున్నారు. రిజర్వేషన్లపై ప్రజల్లో ఉన్న ఉత్కంఠను పరిగణనలోకి తీసుకుంటూ, గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు సమర్ధవంతంగా జరగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *