తిరుమల : తిరుమల శ్రీవారిని టిడిపి ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు.. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టిడిపి ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు రావడం జరిగిందని, స్వామి వారి దర్శనం బాగా జరిగిందని, సాధారణంగా కోండపై రాజకీయాలు మాట్లాడనని, కానీ చంద్రబాబుపై అన్యాయంగా అక్రమ కేసు పెట్టి జైల్ కు పంపడం అనేది చాలా దారుణంమని, త్వరలోనే అక్రమ కేసు నుండి చంద్రబాబు బయటకు వస్తారని, రెట్టింపు ఉత్సాహంతో, ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి రావాలని స్వామి వారిని వేడుకోవడం జరిగిందన్నారు..