Breaking News

తిరుమలలో భక్తులతో మమేకమైన సీఎం చంద్రబాబు

తిరుపతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తులతో మమేకమయ్యారు. కాన్వాయ్‌ను ఆపి దిగిన సీఎం, కొద్దిసేపు కాలినడకన తిరుమల వీధుల్లో నడుచుకుంటూ భక్తులతో మాట్లాడారు.ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం నాణ్యత చాలా బాగుందని భక్తులు సీఎంకు తెలిపారు.అలాగే దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం, త్వరలోనే ఆధునిక సాంకేతికతను వినియోగించి దర్శనాన్ని వేగవంతం చేసే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి దర్శన వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జలవనరుల శాఖకు శశి భూషణ్ కుమార్

ప్రాపర్టీ ట్యాక్స్‌పై పాత విధానమే కొనసాగింపు.. విశాఖ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *