తిరుమల, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో భక్తులతో మమేకమయ్యారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రినారా లోకేష్, దేవాన్ష్ కూడా పాల్గొన్నారు.ఆలయం నుంచి కాలినడకన తరిగొండ వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్ వరకు నడుచుకుంటూ వెళ్లిన సీఎం, మార్గమధ్యంలో మాడ వీధుల్లో భక్తులకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. భక్తులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, సెక్యూరిటీని పక్కన పెట్టి వారితో కరచాలనం చేశారు.ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం, దేవాన్ష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భక్తులను ఆత్మీయంగా అభినందించారు.అనంతరం అన్నదాన కాంప్లెక్స్లో భక్తులకు స్వయంగా భోజనం వడ్డించిన చంద్రబాబు,నారా లోకేష్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ఘటనతో తిరుమలలో భక్తులతో సీఎం కుటుంబం మరింత దగ్గరయ్యారని అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు.













