ఎన్టీఆర్ జిల్లా:అక్టోబర్ 18: నందిగామలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ లో శ్రీబాలాజీ డోర్స్ అండ్ ప్లేవుడ్ షాప్లో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలిసింది,
ప్రమాదం కారణంగా షాప్లో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఇక.. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్లైవుడ్ షాప్ కావడం వల్ల పూర్తిగా దగ్ధమైంది. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా సుమారు 80లక్షల నుండి కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాప్ నిర్వాహకులు తెలియజేశారు.
నందిగామ పాత బస్టాండ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ బాలాజీ డోర్స్ మరియి వుడ్ వర్క్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ షాపులో సిబ్బంది బుధవారం తెల్లవారుజాము వర్కర్లు పనిచేసినట్లు తెలుస్తోంది. పని ముగించుకుని షాపుకు తాళ్ళాలు వేసి వెళ్ళిన వెంటనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా షాపులో ఫర్నిచర్ మరియు మిషనరీ మొత్తం కలిపి దాదాపు రూ. 80 లక్షల వరకు నష్టం వాటిల్లిందని షాపు యజమాని మెండే ప్రసాద్ తెలిపారు. కాగా మంటలను నందిగామ, కంచికచర్ల ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్లు మంటలను రెండు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకుని వచ్చారు. స్థానం పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.