Breaking News

ఎస్‌బీఐ నుంచి కస్టమర్లకు శుభవార్త.

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన State Bank of India తన వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ.3 కోట్లకు పైబడిన బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) పెంచింది. ఈ కొత్త రేట్లు మార్చి 15, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.ఈ సవరించిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లతో పాటు మెచ్యూరిటీ సమయంలో పునరుద్ధరించుకునే డిపాజిట్లకూ వర్తిస్తాయి. అయితే రూ.3 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపై ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్త వడ్డీ రేట్లు (బల్క్ డిపాజిట్లు):

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు
  • 46 నుంచి 179 రోజులు: 5.10% → 5.35%
  • 180 రోజులు నుంచి 1 సంవత్సరం లోపు: 5.60% → 5.85%
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు: 6.25% → 6.50%

వయోవృద్ధులకు అదనపు ప్రయోజనం:
సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ రాబడి లభిస్తుంది.

  • 46–179 రోజులు: 5.60% → 5.85%
  • 180 రోజులు–1 సంవత్సరం: 6.10% → 6.35%
  • 1–2 సంవత్సరాలు: 6.75% → 7.00%

బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం, ఇతర నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. గడువుకు ముందే డిపాజిట్ ఉపసంహరించుకుంటే 1% పెనాల్టీ విధించబడుతుంది.ఈ నిర్ణయం పెద్ద మొత్తాల్లో డిపాజిట్ చేసే పెట్టుబడిదారులకు మరింత లాభదాయకంగా ఉండనుంది.

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *