కుట్ర దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
లేని పక్షం లో చాట్రాయ్ లో నిరవధిక నిరసన చేస్తా: రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్
విజయవాడ-శనివారం/మార్చ్ 21 నేటి తెలుగు పత్రిక: అంబటి అనుదీప్ హత్య పై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కాపు జే ఏ సీ అధ్యక్షులు చందు జనార్ధన్.శనివారం విజయవాడ లో ఆయన కాపు జే ఏ సి కార్యాలయం లో మాట్లాడుతు నూజివీడు నియోజక వర్గం లో చా ట్రాయ్ లో కాపు కుటుంబ సభ్యుడైన అంబటి అనుదీప్ మరణం హత్యేనని మండలం అంతా ఘోషిస్తువుంటే స్థానిక స్టేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని చందు జనార్దన్ ఆరోపించారు.ఈరోజు చట్రాయ్ లో అనుదీప్ యొక్క దశదినకర్మ ను కుటుంబం నిర్వహించిందని అంబటి అనుదీప్ కి సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి కాపు జే ఏ సి పక్షాన సానుభూతిని తెలియ చేశారు.అనుదీప్ ది హత్యేనని చా ట్రాయ్ పోలీస్టేషన్ లో తండ్రి అంబటి గోపాలరావు ఫిర్యాదు చేశారు.కానీ స్టేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు.అనుదీప్ హత్యపై మండల నాయకత్వం,మరియు జనసేన నాయకులు జగన్ రాష్ట్ర కాపు జే ఏ సి నాయకత్వం సంఘటన పై వివరించగా బుధవారం వెంటనే 3 గంటలకు అనుదీప్ నివాసానికి వెళ్లడం జరిగింది.కాపు కుటుంబ సభ్యులు మండల నాయకత్వం 300 మంది రావడం వారందరి ఆవేదన వినడం సమావేశం జరపడం జరిగింది.
అనుదీప్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిని హతమార్చారని,పోలీస్ యంత్రాంగం పూర్తిగా నేరస్తులకు వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే బాటలో అక్కడ ఉన్న అందరూ స్పష్టం చేయడం జరిగింది.అనుదీప్ హత్య పై సమగ్ర దర్యాప్తు చేయాలి దోషులను కఠినంగా శిక్షించాలి.నేరస్తులకు వంత పాడిన స్టేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి కుట్రలో భాగస్తులను అరెస్ట్ చేయాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ నేడు డిమాండ్ చేశారు.జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాలపై వెంటనే చర్యలు తీసుకొపోతే రాష్ట్ర కాపు జే ఏ సి చా ట్రాయ్ లో నిరవధిక నిరసన కార్యక్రమం చేపడుతుందని ప్రకటించారు.
