మార్చి 21, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మసూద్ పెజెష్కియన్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇద్దరు నేతలు కీలకంగా చర్చించారు.ఇటీవల ఆ ప్రాంతంలో మౌలిక వసతులపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే యుద్ధ పరిస్థితుల్లో పౌరుల మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మోదీ, భారతీయుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇంధన సరఫరా, సరకు రవాణా వ్యవస్థలు అంతరాయం లేకుండా కొనసాగాలని సూచించారు.ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాల భద్రతపై కూడా ఆయన దృష్టి సారించారు. నావిగేషన్ స్వేచ్ఛను కాపాడడం అత్యవసరమని, రవాణా మార్గాలు ఎల్లప్పుడూ భద్రంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఈద్, నౌరూజ్ పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
