యాదగిరిగుట్ట : మార్చి 21 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామంలో ఈ రోజు సిసి రోడ్డు పనులను సర్పంచ్ శివరాత్రి లావన్య జహంగీర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల సహకారంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధుల నుండి 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించరు . గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొనె జహంగీర్ ,వార్డు సభ్యులు, సత్యం, బండారి స్వప్న కుమార్, తుటి సుమలత మహేష్, గోధుమకుంట మధు , కొండ పాండు, రవికిరణ్ గ్రామస్తులు వల్లపు అంజయ్య, రగుల బాలనర్సయ, మాజీ సర్పంచ్ సింగం వెంకటేష్, కొండ ప్రవీణ్, బోసు కృష్ణ, సింగం ప్రభాకర్, డొంకనా ప్రభాకర్ పాల్గొన్నారు.
