Breaking News

సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ టూర్.. రూ.775 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమం భాగంగా, ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.ముఖ్యంగా నంగునూరు మండలం నర్మెట్టలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సీఎం ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేయనున్నారు. అదేవిధంగా ఆయిల్ పామ్ రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన కూడా చేయనున్నారు.

రైతులకు ప్రత్యేక ఫోకస్

ఈ కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించి, ప్రభుత్వ ప్రగతి ప్రణాళికలను వివరించనున్నారు.

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సిద్ధిపేటలో ప్రధాన అభివృద్ధి పనులు:

  • నీటి సరఫరా, డ్రైనేజీ ప్రాజెక్టులు – రూ.141.34 కోట్లు
  • జిల్లా జైలు భవనం – రూ.78 కోట్లు
  • 50 పడకల ఆయుష్ ఆసుపత్రి – రూ.15 కోట్లు
  • సెంట్రల్ మెడిసిన్ స్టోర్ – రూ.3.60 కోట్లు
  • పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ భవనాలు – ప్రారంభోత్సవాలు

గజ్వేల్‌లో ప్రాజెక్టులు:

  • రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మౌలిక వసతుల విస్తరణ – రూ.16.62 కోట్లు
  • మండల కార్యాలయ సముదాయాలు (IOC) – మర్కూక్, జగదేవ్‌పూర్‌లో ప్రారంభోత్సవాలు

మొత్తంగా, ఈ పర్యటన ద్వారా Telanganaలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల రంగాల్లో అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆదివారం చికెన్ కష్టాలు.. గుడ్డుతో సరిపెడుతున్న సామాన్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *