బెల్లంపల్లి, మార్చి 22 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన వేముల మానస కు శనివారం రాత్రి హైదరాబాద్ లో సినీ నటులు బాబు మోహన్ పద్మశాలి ఉగాది పురస్కారాన్ని అందజేశారు. మానస రామాయణంలో 2800 శ్లోకాలను 150 నిమిషాల్లో పూర్తిచేసి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ రికార్డును సాధించింది. దీంతో నటులు బాబు మోహన్ చేతుల మీదుగా ఆమె హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఉగాది పురస్కారాన్ని అందుకున్నది.
