యాదగిరిగుట్ట : మార్చి 22 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి భువనగిరి జిల్లాకు విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆదివారం వివేరా హోటల్లో జరిగిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ఆయనను శాలువాతో సత్కరించి ఘనంగా ఆహ్వానించారు.
