Breaking News

సైబర్ మోసాలకు చెక్.. వాట్సప్ సూపర్ ఫీచర్ టెస్టింగ్‌లో

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ WhatsApp యూజర్ల భద్రత కోసం మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లు చదివిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే డిసప్పియరింగ్ మెసేజ్‌ల వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ, ఈ కొత్త “ఆఫ్టర్ రీడింగ్” ఆప్షన్ మరింత అడ్వాన్స్‌గా ఉండనుంది. మీరు ఒక మెసేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే సిస్టమ్ టైమ్‌ను గుర్తించి, 15 నిమిషాల తర్వాత ఆ మెసేజ్‌ను పూర్తిగా తొలగిస్తుంది.ఒకవేళ మీరు మెసేజ్‌ను వెంటనే చూడకపోతే, అది 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. ఈ విధంగా యూజర్ గోప్యతను కాపాడేలా ఈ ఫీచర్ రూపొందించబడింది.ప్రస్తుతం సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంక్ OTPలు, పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని రక్షించేందుకు ఈ ఫీచర్ కీలకంగా మారనుంది. ముఖ్యంగా వ్యక్తిగత డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఇది సహాయపడుతుంది.ఇప్పటికే ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్ష దశలో ఉంది. త్వరలోనే అన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *