Breaking News

సైబర్ మోసాలకు చెక్.. వాట్సప్ సూపర్ ఫీచర్ టెస్టింగ్‌లో

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ WhatsApp యూజర్ల భద్రత కోసం మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లు చదివిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే డిసప్పియరింగ్ మెసేజ్‌ల వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ, ఈ కొత్త “ఆఫ్టర్ రీడింగ్” ఆప్షన్ మరింత అడ్వాన్స్‌గా ఉండనుంది. మీరు ఒక మెసేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే సిస్టమ్ టైమ్‌ను గుర్తించి, 15 నిమిషాల తర్వాత ఆ మెసేజ్‌ను పూర్తిగా తొలగిస్తుంది.ఒకవేళ మీరు మెసేజ్‌ను వెంటనే చూడకపోతే, అది 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. ఈ విధంగా యూజర్ గోప్యతను కాపాడేలా ఈ ఫీచర్ రూపొందించబడింది.ప్రస్తుతం సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంక్ OTPలు, పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని రక్షించేందుకు ఈ ఫీచర్ కీలకంగా మారనుంది. ముఖ్యంగా వ్యక్తిగత డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఇది సహాయపడుతుంది.ఇప్పటికే ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్ష దశలో ఉంది. త్వరలోనే అన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

సమ్మర్‌లో కుండ నీరు బెస్ట్.. వడదెబ్బకు నేచురల్ సొల్యూషన్

ఎస్‌బీఐ నుంచి కస్టమర్లకు శుభవార్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *