మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధికి రైతుల సంక్షేమమే కీలకమని తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు.కొంతమంది కావాలనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోదని మంత్రి తెలిపారు. రైతుల కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.రైతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపైనే తమ పూర్తి దృష్టి ఉందని, అనవసర విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
