మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో దివంగత సామాజిక సంస్కర్త దొమ్మటి వెంకట రెడ్డి జయంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, సమాజ అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు.రాష్ట్రవ్యాప్తంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి తెలిపారు.అదేవిధంగా, ఆయన విగ్రహ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

