Breaking News

ఇరాన్‌పై దాడులకు విరామం.. ట్రంప్ సంచలన ప్రకటన

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.రాబోయే 5 రోజుల పాటు ఎటువంటి సైనిక దాడులు చేయబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం యుద్ధ పరిస్థితుల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.ఇరాన్‌తో గత రెండు రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ చర్చల ద్వారా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.ఈ నిర్ణయం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొంత తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

IRCTC బుకింగ్స్‌లో పెద్ద మార్పులు.. జూలై నుంచి అమలు

మొబైల్ నంబర్ లేకుండా చాట్‌లు, కాల్స్.. దేశీ AI యాప్ లాంచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *