మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై జరుగుతున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.రాబోయే 5 రోజుల పాటు ఎటువంటి సైనిక దాడులు చేయబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం యుద్ధ పరిస్థితుల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.ఇరాన్తో గత రెండు రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ చర్చల ద్వారా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.ఈ నిర్ణయం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొంత తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
