- సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జహంగీర్.
యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): దేశ స్వాతంత్రం కోసం ఉరి ఖంభం మెక్కిన వీరులు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ చిత్ర పటాలకు సీపీఎం జిల్లా కార్యాలయం లో పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సెక్రెటరీ ఎండి జహంగీర్ మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి ఉరి ఖంభం ఎక్కారని వీరుల మరణం వృధా కాదని అన్నారు.నాడు దేశ విముక్తి కోసం కుల మతాలకు అతీతంగా పోరాడరని అందుకే విజయాలు సాధించారని అన్నారు. నాటి స్ఫూర్తి తో నేటి పాలకుల మతోన్మాద విధానాలను ఐక్యంగా ఓడించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బోలగాని జయరాములు. కోమటిరెడ్డి చంద్రారెడ్డి,మాయ కృష్ణ దయ్యాల నర్సింహా,వనం ఉపేందర్, పల్లెర్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
