నెల్లూరు మార్చి 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విద్యార్థుల అభ్యాసాన్ని మార్పునకు సంకేతంగా మార్చేలా తాము చేస్తున్న కృషి వల్లే నేడు (మార్చి 23) రాష్ట్రంలో అత్యుత్త మ ఫలితాలు సాధిస్తున్నమని సంస్థ సహవ్యవస్థాపకుడు, విద్యావేత్తల అధిపతి ఆనంద్ ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రా ల్లో 118 మంది విద్యార్థులు 90శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించగా, ఇందులో అత్యధిక మంది తమ సంస్థకు చెందిన వారేనని ఆయన వెల్లడించారు. సాహిల్ బి 99.72 శాతం మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడ ని తెలిపారు. అతనికి రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించగా, డి.ఎం.అఖిల్ 99.51 శాతం, డి.ఎం. అక్షత్ 99.34 శాతం సాధించారు. మరికొందరు రాష్ట్రంలో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులు 99.5 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు. 10 మంది విద్యార్థులు 99 శాతం మార్కులను అధిగమించారని తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన ఈ విద్యార్థుల వెనుక ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి మరింత శిక్షణ అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 17వ స్థానాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. గతంలో జాతీయ స్థాయి లో పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. కేంద్రానికి చెందిన సంస్థలు తమ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వివిధ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము రూపొందించిన కోర్సులు, సిస్టమేటిక్ ట్రైనింగ్ విధానం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక మార్గదర్శకత అందిస్తు న్నామని అన్నారు.
