Breaking News

‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ వేదికపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: వాట్ ఇండియా థింక్స్ టుడే Summit కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమయంలో TV9 Network ఒక ముఖ్య వేదికగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు.ప్ర పంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్‌ తన శక్తి, సామర్థ్యాలతో ముందుకు సాగుతోందని ప్రధాని తెలిపారు. 2014తో పోలిస్తే ఇప్పుడు దేశంలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటోందని చెప్పారు.కరోనా తర్వాత పరిస్థితులు క్లిష్టమైనప్పటికీ, 140 కోట్ల భారతీయుల ఐకమత్యంతో దేశం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని తెలిపారు.

ప్రధాన పార్టీలకు షాక్.. విజయ్ బిగ్ గేమ్ ప్లాన్!

అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల మధ్య కూడా భారత్ అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రైతుల ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు జమ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కూడా ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయాలతో దేశంపై భారం మోపారని, ప్రస్తుతం కూడా అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.తూర్పు భారత రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అస్సాం, బిహార్‌, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పెరిగిందని పేర్కొన్నారు.మొత్తంగా, సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే సందేశాన్ని ప్రధాని మోదీ ఈ సమ్మిట్ వేదికగా ఇచ్చారు.

“యుద్ధానికి మొదటగా మద్దతిచ్చింది అతడే” – ట్రంప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *