మార్చి 24, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ పీక్లో ఉన్న సమయంలో కొందరు హీరోలు తన ఎదుగుదలను ఓర్వలేక వెనుక నుంచి కుట్రలు పన్నారని ఆమె ఆరోపించారు. “ఒక హీరో చేసిన పనులు గుర్తొస్తే ఇప్పటికీ అతన్ని చూస్తే అసహ్యం వేస్తుంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, ఆ హీరో పేరును మాత్రం వెల్లడించలేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ, అడవి చుక్క వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆమె భారీ విజయాలు అందుకున్నారు.అంతేకాదు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించారు. యాక్షన్ సీన్స్లో హీరోలకు ధీటుగా నటిస్తూ “లేడీ అమితాబ్” అనే బిరుదును కూడా దక్కించుకున్నారు.తన సినిమాలు పెద్ద హీరోల సినిమాలకు సమానంగా వసూళ్లు సాధించడంతో కొందరు అసూయతో వ్యవహరించారని, వెనుక నుంచి అడ్డంకులు సృష్టించారని ఆమె తెలిపారు.
