మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మత మార్పిడి నేపథ్యంలో ఎస్సీ హోదాపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారికే షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హక్కులు వర్తిస్తాయని, ఇతర మతాల్లోకి మారిన వారికి ఈ హోదా కొనసాగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ముఖ్యంగా క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందలేరని తేల్చి చెప్పింది.ఈ తీర్పుతో మత మార్పిడి, రిజర్వేషన్లపై ఉన్న అనుమానాలకు క్లారిటీ వచ్చినట్టైంది.
