Breaking News

రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్!

అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రాజధాని ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో, ఈ అగ్ని ప్రమాదాలపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మూడు వేర్వేరు ఘటనల్లో కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామగ్రి దగ్ధమైంది. రాయపూడిలో జరిగిన తాజా అగ్ని ప్రమాదంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఘటనల వెనుక కారణాలు ఏంటో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

జల్ జీవన్ మిషన్‌కు ఎంవోయూ.. 2028 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు!

మంగళగిరిలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల సమస్యలపై హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *