Breaking News

రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్!

అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రాజధాని ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో, ఈ అగ్ని ప్రమాదాలపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మూడు వేర్వేరు ఘటనల్లో కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామగ్రి దగ్ధమైంది. రాయపూడిలో జరిగిన తాజా అగ్ని ప్రమాదంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఘటనల వెనుక కారణాలు ఏంటో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *