అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రాజధాని ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో, ఈ అగ్ని ప్రమాదాలపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మూడు వేర్వేరు ఘటనల్లో కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామగ్రి దగ్ధమైంది. రాయపూడిలో జరిగిన తాజా అగ్ని ప్రమాదంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఘటనల వెనుక కారణాలు ఏంటో గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
