యాదగిరిగుట్ట : మార్చి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తనకు పదవినిచ్చిన నేతలకు.. ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్ మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.పార్టీ అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న విజయ్ కుమార్ గతంలో ఆలేరు పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
