మార్చి 25, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియాలో వైరల్గా మారిన నటి మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన భర్త ఫర్మాన్ ఖాన్తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె సంచలన ఆరోపణలు చేసింది.ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా సందర్భంగా గుర్తింపు పొందిన మోనాలిసా, ఆ తర్వాత సినీ అవకాశాలు పొందింది. అయితే తాజాగా ఒక సినీ దర్శకుడిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది.సినిమాల్లో అవకాశాల పేరుతో ఒక దర్శకుడు తనతో పాటు మైనర్ బాలికలతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. “షూటింగ్ సమయంలో పలుమార్లు శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించాడు. ఆ సమయంలో భయంతో ఎవరికీ చెప్పలేకపోయాను” అంటూ ఎమోషనల్ అయ్యిందిఆ దర్శకుడు తనపై వ్యక్తిగత కక్షతోనే తన వివాహాన్ని “లవ్ జిహాద్”గా చిత్రీకరిస్తున్నాడని మోనాలిసా పేర్కొంది. ఈ వివాదంలో దర్శకుడు సనోజ్ మిశ్రా పేరును ప్రస్తావిస్తూ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది.ఇటీవల కేరళలో హిందూ సంప్రదాయం ప్రకారం తన వివాహం జరిగినట్లు మోనాలిసా స్పష్టం చేసింది. తమ పెళ్లి చట్టబద్ధమని, అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపింది.అదే సమయంలో తనకు, తన భర్తకు ప్రాణహానీ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం, కేరళ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను రక్షణ కల్పించాలని కోరింది.
