Breaking News

దక్షిణాది పాత్ర తగ్గిపోతుంది.. లోక్‌సభ పునర్విభజనపై తెలంగాణ సీఎం వ్యాఖ్యలు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే విధంగా చర్యలు తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం రాష్ట్రాల వారీగా ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తిని కొనసాగిస్తూ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని సూచించారు. 50 శాతం మేర సీట్లు పెంచే ప్రతిపాదన అమలు చేస్తే, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వ్యాఖ్యలను ఆయన What India Thinks Today Summit 2026లో చేశారు. TV9 Network ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మిట్‌లో పలు జాతీయ అంశాలపై స్పందించారు.లోక్‌సభ పునర్విభజన వంటి కీలక అంశంపై ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. ముందుగా నిర్ణయం తీసుకుని తర్వాత చర్చలు నిర్వహించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో ట్విస్ట్.. హైకోర్టు నోటీసులు జారీ

కేంద్ర-రాష్ట్ర సంబంధాలు సుహృద్భావంగా ఉండాలని కోరుతూ, పెద్ద రాష్ట్రాల ఆధిపత్యం పెరిగితే చిన్న రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.అదేవిధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.లోక్‌సభ పునర్విభజన అంశం దేశ రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కోట్ల లావాదేవీల కేసు.. ఫినో బ్యాంక్ MDకు షాక్ ఇచ్చిన హైకోర్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *