Breaking News

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. రాష్ట్రంలో ఇంధన పరిస్థితులపై సీఎం సమీక్ష

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన సరఫరాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించనున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, ఎల్‌పీజీ సిలిండర్లు, యూరియా నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా, గ్యాస్ లేదా పెట్రోల్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల సమర్థ నిర్వహణపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.మొత్తంగా, పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

కోట్ల లావాదేవీల కేసు.. ఫినో బ్యాంక్ MDకు షాక్ ఇచ్చిన హైకోర్టు

డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *