Breaking News

RR అమ్మకం.. షేన్‌వార్న్‌ ఫ్యామిలీకి ₹450 కోట్లు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారీ డీల్ తర్వాత ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డీల్ కారణంగా దివంగత క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి సుమారు రూ.450 కోట్లు దక్కనున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ ప్రారంభ దశలో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్న్‌కు జట్టు నిర్వహణలో కీలక పాత్ర ఇచ్చారు. ఆ సమయంలో ఆయనకు ప్రతి ఏడాది 0.75% యాజమాన్య వాటా కేటాయించారు.మొత్తం నాలుగు సీజన్లు ఆడిన వార్న్, దాదాపు 3% వాటాను సొంతం చేసుకున్నారు. తాజాగా ఫ్రాంచైజీ విక్రయం నేపథ్యంలో ఆ వాటా విలువ భారీగా పెరిగి, ఆయన కుటుంబానికి కోట్ల రూపాయలు అందనున్నాయి.ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ (2008)లో రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన వార్న్, జట్టు చరిత్రలో అత్యంత కీలక వ్యక్తిగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ విక్రయం కేవలం స్పోర్ట్స్ డీల్ మాత్రమే కాకుండా, క్రికెట్ లెజెండ్స్‌కు కూడా ఆర్థికంగా ఎంత పెద్ద లాభాలను తెస్తుందో ఈ ఉదాహరణ చూపిస్తోంది.

కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. రికార్డ్ ధరకు డీల్

2027 వరల్డ్ కప్‌పై ఫోకస్.. ఆరుగురు పేసర్లకు చోటు ఫిక్స్! షమీకి షాక్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *