Breaking News

సిరిసిల్ల నేతన్నలపై విద్యుత్ భారాలు.. మాఫీ చేయాలంటూ ప్రభుత్వానికి వినతి

సిరిసిల్ల, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విద్యుత్ బకాయిలు, సర్‌చార్జీల భారంతో ఇబ్బందులు పడుతున్న నేతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులను కలిసి వినతి పత్రం అందజేశారుసిరిసిల్లలోని పవర్‌లూమ్ యూనిట్లపై విధించిన విద్యుత్ బకాయిలు, ముఖ్యంగా ‘బ్యాక్ బిల్లింగ్’ భారంతో పరిశ్రమ కుదేలవుతోందని వివరించారు. గతంలో 25 హెచ్.పి వరకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసిందని పేర్కొన్నారు. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లపై రూ.19 కోట్ల బకాయిలు విధించగా, సర్‌చార్జీలతో కలిపి అది రూ.38 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ భారీ భారం చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తీవ్రంగా కలిచివేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో మానవీయ కోణంలో ఈ బకాయిలను మాఫీ చేసి నేతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడేందుకు తక్షణ చర్యలు అవసరమని స్పష్టం అవుతోంది.

అకాల వర్షాలతో రైతులు నష్టాల్లో.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: హరీశ్‌రావు

మూసీ నదిలో చిక్కుకున్న మహిళను ధైర్యంగా కాపాడిన హైడ్రా బృందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *