యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ బుధవారం పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్దిదారులను కోరారు.వార్డును తిరుగుతూ పారిశుడు సమస్యల పరిష్కారం కోసం నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంగడి ఆంజనేయులు, కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది , వార్డు ప్రజలు పాల్గొన్నారు.
