నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి పలు పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ బుస్సా సులోచన తెలిపారు సీట్లు సాధించిన విద్యార్థులను బుధవారం పాఠశాల ఆవరణలో అభినందించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీర కుమారి మల్లిక, సాజిదా ,సప్న, నాగమణి పాల్గొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మహేష్ ఉపాధ్యాయులు సైదులు, రాంబాబు అభినందించారు.
