నడిగూడెం, మార్చి 25 నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో ఎంపిపిఎస్ రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గీతిక, మణి ప్రియ, అనూష, జస్వంత్ లు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముదిగొండ శ్రీనివాస్ రావు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
