Breaking News

ప్రభుత్వ బడి” ముందస్తు బడిబాట కార్యక్రమం” ప్రారంభం

ఎన్రోల్మెంట్ పెంచడానికి ముందస్తు బడిబాట కార్యక్రమం ప్రారంభం.

ఎండి సలీం షరీఫ్ మండల విద్యాధికారి

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలీ

కోదాడ. మార్చి25. నేటి తెలుగు పత్రిక: కోదాడ పట్టణంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి, కోదాడ మండల విద్యాధికారి ఎండి .సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు. “ప్రజా పాలన -ప్రణాళిక ప్రగతి” కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచడం కోసం ముందస్తుగా” బడిబాట” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపినారు. పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, సౌకర్యాలను తల్లిదండ్రులకు విద్యార్థులకు వివరంగా తెలియజేస్తూ, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో రానున్న 2026 -27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ బడిలో చదవటం ద్వారా విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి, వికాసం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు చల్లని చలివేంద్రాలు ఏర్పాటు: ఎంపీడీవో బి. శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *