Breaking News

పీపీఏ అయిన వెంటనే విద్యుత్తు ప్లాంట్ల రెండో దశ పనులు

ఎన్టీపీసీ రామగుండం ED చందన్ కుమార్ సమంత

కరీంనగర్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఎన్టీపీసీ రెండో దశ పనులు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగిన వెంటనే ప్రారంభిస్తామని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత తెలిపారు రామగుండంలోని ఎన్టీపీసీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ . తెలంగాణ ఎన్టీపీసీ రెండో దశకు అన్ని అనుమతులు లభించాయని నిర్మాణ ఏర్పాట్లు చేసు కున్నామని . కేవలం పీపీఏ కోసమే వేచి చూస్తున్నామని తెలిపారు రామ గుండం ఎన్టీపీసీలో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కేంద్రం పనులు పూర్తయ్యాయని గ్రిడ్ నుంచి ఎప్పుడు ఆహ్వానం వచ్చినా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా మని చెప్పారు. ఇప్పటికే 100 మెగా వాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు.

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలీ

పర్యావరణ పరిరక్షణ చర్యలు ఎఫ్డీ(ఫ్యూయల్ గ్యాస్ డీమిన రైలైజేషన్) నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని, నాణ్యమైన విద్యుత్తు నిరం తరంగా ఈ అందించేందుకు ఎన్టీపీసీలోని 2, 4, 6 యూనిట్లకు వార్షిక మరమ్మతులు పూర్తి చేశామని చెప్పారు. ఏడాది ఎన్టీపీసీ 13.4 బిలియన్ యూనిట్లు (86.3 శాతం), తెలంగాన ప్రాజెక్టు 9.2 బిలియన్ యూనిట్ల (91.4 శాతం) విద్యుత్తు ఉత్పత్తి చేశాయన్నారు. డీజిల్, గ్యాస్ కొరత ఏమీ లేదని, 5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టు, ఎన్టీ పీసీ ఆపరేషన్ జీఎంలు ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్, జీఎంలు అబిజిత్ దత్త, బిన్ జోష్, హెచ్ వోడీలు డి.ఎస్.రావత్, బిజయ్ కుమార్, సిగ్ధ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు చల్లని చలివేంద్రాలు ఏర్పాటు: ఎంపీడీవో బి. శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *