మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈనెల 28న అసెంబ్లీ సమావేశం నిర్వహణపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.అసెంబ్లీ సమావేశ తేదీలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుని, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.అదేవిధంగా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపే విషయంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.మొత్తంగా, రేపటి కేబినెట్ సమావేశం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశముందని భావిస్తున్నారు.
