Breaking News

శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదం.. కానిస్టేబుల్ మృతి

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి ప్రాణాలు కోల్పోయారు.నంద్యాల జిల్లా సున్నిపెంట పరిధిలో డ్యామ్ వద్ద పహారా కాస్తున్న సమయంలో ఆకస్మికంగా తేనెటీగల గుంపు ఆయనపై దాడి చేసింది. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తీవ్ర భయంతో పరుగులు తీసిన ఆయన కింద పడిపోయారు.వందలాది తేనెటీగలు కుట్టడంతో పాటు, తీవ్ర భయంతో గుండెపోటు వచ్చినట్లు సమాచారం. వెంటనే సహచర సిబ్బంది ఆయనను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటనలో మరో ఇద్దరు సిబ్బందికి గాయాలు కాగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.బాపట్ల జిల్లా చీరాల సమీపానికి చెందిన వీరస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.ఈ ఘటనతో డ్యామ్ పరిసరాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. అధికారులు సంఘటనపై విచారణ చేపట్టారు.

అర్జీల స్వీకరణలో పాల్గొన్న ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ (APBWC) బుచ్చి రాంప్రసాద్

రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం.. పవన్ కళ్యాణ్ చేత వర్చువల్ లాంచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *