Breaking News

మార్కాపురం ప్రమాదం.. ఘటనాస్థలానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: కందుల నారాయణరెడ్డి మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా అధికారులకు సూచించారు.నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బాధితులకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ సర్కార్ కీలక అడుగు

రైతులకు అన్యాయం సహించబోం: అచ్చెన్నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *