Breaking News

మార్కాపురం విషాదం.. అధికారులతో సీఎం సమీక్ష సమావేశం

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడిన ఘటనపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితులను అధికారులతో సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందేలా చూడాలని, అవసరమైతే మెరుగైన ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.అలాగే ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమై అన్ని శాఖలను అలర్ట్ చేసింది.

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ సర్కార్ కీలక అడుగు

రైతులకు అన్యాయం సహించబోం: అచ్చెన్నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *